Skip to main content

అమ్మ వారి చెంత ఆ భగవంతుని లీలలు.

నర ద్రుష్టి ని కూడా ఆ భగవంతుని మీద పడకుండా అమ్మవారు రక్షణగా ఉన్నారు ఆ భగవంతుని చాతిమీద నివాసము పెట్టుకుని ఉన్న అమ్మవారు కాబట్టి భగవంతుని ఆభరణాలు ఇంకా ఇంకా జిగేలు మనిపించి విలువ కట్టలేనంతగా వెలిగిపోతున్నాయి.రావణుడు రాముడిని చంపి రమ్మని మారీచుడిని పంపినాడు. సీతలేని రాముడుగా ఉండుట చూచి, సీతమ్మను పెళ్ళిచేసుకుని ఉన్న రాముడికి అనంత శక్తి కలిగి ఉన్నాడు, కాబట్టి నేను రాముడిని చంపలేను అని రావనసురినితో అంటాడు.పెరియ వచన పిళ్ళై అంటాడు. భగవంతుడు ఒక వజ్రము. కాని వజ్రాలలో చాల రకాలు. వజ్రము విలువగాలది అంటే మిగతా వజ్రాలకంటే అతి ఉత్తమ మయినది కాదా అర్థము. అలాగే భగవంతుడు వజ్రము అని అనుకుంటే లక్ష్మి అమ్మవారు ఆయన తో పాటు ఉన్నందువలన అతను విలువ కట్టలేన్తగా అయినాడు అని వర్ణిస్తాడు ఒక పాశురములో.అల్లాగే మంచి సుగంధము ఇచ్చే పూవులు ఎక్కువ విలువ కట్టినట్టే ఆ మహలక్ష్మి కలిగి ఉన్న భగవంతుడు కూక అతి విలువ అయిన వాడు.కాబట్టి భగవంతుని ఆత్రత అంతా గూడ ఆమె బాగుండాలని. ఆమె బాగుండాలంటే అతడు బాగా ఉంటాడు. అలాగే శంకు మరియు చక్రము గురించి చెప్పినాడు. గోదాదేవి కూడా తన పాశురములో తనకు శంకు కావాలని ప్రార్థించింది. ఎందుకంటే చక్రము కంటే శంకువు ఆ భగవంతుని నోటికి చేరి ఆ పెడుముల మధురిమలు తీసుకొని వచ్చింది కాబట్టి చక్రము కంటే శంఖం గొప్పది అని వివరించినాడు.శంఖము యొక్క శభ్దము వినగానే భగవంతుని శత్రువుల గుండెలలో దిగులు.

Comments

Popular posts from this blog

పూలు,పండ్లు, వివాహ నిశ్చితార్థం పూజ సామగ్రి

 పసుపు 200 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు,  శ్రీ గంధం చిన్న డబ్బా 1, అక్షతలు 200 గ్రాములు, బియ్యం పూజకు 2 కిలోలు, దీపం చెమమేలు 2, వత్తులు , అగ్గిపెట్టె,  విడి పూలు, మల్లెలు,కాంకాయంబురాలు పూల దండలు,  రాగి చెంబు కలశం, 1, ఆచమనం పాత్ర 1, మామిడి కుమ్మలు  తెల్లని వస్త్రము బంగారు అంచు ఉండాలి 1, కనుము బట్టలు అంచు తో ఉండాలి 2, ఎండు కుడుకలు 1/2 కిలో, అయిదు రకముల పండ్లు, ఒక్కొక్కటి 5 తో బాస్కెట్లు  బాదాం పలుకుల బాస్కెట్, etc .  తమల పాకులు 100,  నల్లని పోక వాక్కలు 50, ఖర్జూరం పాకెట్, రూపాయి నాణెములు 21, టెంకాయలు 1, కూర్చ 1, పవిత్రలు 2, ఆగరబతి పాకెట్, కర్పూరం పాకెట్,  సెంట్ సీసా 1, కొబ్బరి చూర్ణము మరియు చక్కెర లేదా స్వీట్ బాక్స్ కిలో, లగ్న పత్రికలు, 2, అబ్బాయి తల్లి దండ్రులకు అబ్బాయికి బట్టలు, ఆభరణాలు వగైరా.  పురోహిత్ దక్షిణ  ఈ విధంగా పెండ్లి పిల్ల వాళ్ళు , మరియు పెండ్లి పిల్లవాడు వాళ్ళు కూడా తేవాలి. ఇరువురు ఒకరికి ఒకరు ఇచ్చుకోవాలి. 

యమ తర్పణం విధి విధానం

27-10-2019 ఆదివారం నాడు ఉదయం పూట యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షిణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు భుజించడం, సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. నరకలోకవాసులకు పుణ్యలోకప్రాప్తి కలిగించే ఉత్సవమని, అందుకు ఉద్దేశితమైన కార్యకలాప దినమని, తమకు నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశియని ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి. ‘చతుర్దశ్యాంతయే దీపాన్నరకాయ దదంతిచ, తేషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:’ చతుర్దశినాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృ దేవతలు నరకం నుండి స్వర్గం వెళతారని శాస్త్ర వచనం.

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-