Skip to main content

భగవంతుని పాద స్పర్శ మహిమ....

పెరియాల్వార్లు రచించిన పల్లాన్డులో భగవంతుని పాదాల స్పర్శవలన సకల పాపాలు తొలగిపోతాయి.అతడు భగవంతుని పాదాలను ఒక పద్మ కమలము లాగ పోల్చి మనలను తరింప చేసిన వాడు. ఆ పాదాలు రామావతారములో అనేక మైళ్ళు నడచినకూడా అరిగిపోని కాళ్ళు మరియు చాల భలము గలవి. అలాగే భగవంతుని చేతులు కూడా చాల భలము గలవి. అయితే భగవంతుని చేతులు కాకుండా కాళ్ళ ప్రాముఖ్యత ఏమిటి అని అంటే భక్తులు భగవంతుని చేతుల కంటే పాదాలు పట్టుకోవదములోనే ఎంతో ఆనందము అనుభవిస్తూ పరవశించిపోతున్నాడు. సీతమ్మవారు రాముని కాళ్ళు పట్టుకొంటే నిన్ను నీ పాపాలను వోదిలిపెదతాడు అని చెప్పదములోనే భగవంతుని పాదాల మహిమ తెలుస్తున్నది కదా. మనమందరమూ కూడా భగవంతుని దాసులము కాబట్టి భగవంతుని పాదాల దగ్గిరనే మన నివాసము. ఎలాగయితే మనము అందరిచేత చేతులు కలుపుతూ మర్యాదగా పలకరించినట్టుగా భగవంతుని చేతులు అందరిలాగా పట్టుకోలేముకద. కాబట్టి ప్రతి భక్తుని ముఖ్య విధి భగవంతుని చరనములు పట్టుకొని మొక్కడమే. తల్లి తన పిల్లలను ఎతుకొని ముద్దు పెట్టినట్టుగానే ఆ భగవంతుడు కూడా భక్తుల భాదలు తీర్చాలనే తపనో ఉంటాడట.భక్తుడు కూడా భగవంతుని చరణములు పట్టుకొని విడవకుండా ఉండాలని మన శ్రీ వైష్ణవ ఆళ్వారుల ఆశీర్వచనములు మనకు ఉండాలని ప్రార్థన

Comments

Popular posts from this blog

పూలు,పండ్లు, వివాహ నిశ్చితార్థం పూజ సామగ్రి

 పసుపు 200 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు,  శ్రీ గంధం చిన్న డబ్బా 1, అక్షతలు 200 గ్రాములు, బియ్యం పూజకు 2 కిలోలు, దీపం చెమమేలు 2, వత్తులు , అగ్గిపెట్టె,  విడి పూలు, మల్లెలు,కాంకాయంబురాలు పూల దండలు,  రాగి చెంబు కలశం, 1, ఆచమనం పాత్ర 1, మామిడి కుమ్మలు  తెల్లని వస్త్రము బంగారు అంచు ఉండాలి 1, కనుము బట్టలు అంచు తో ఉండాలి 2, ఎండు కుడుకలు 1/2 కిలో, అయిదు రకముల పండ్లు, ఒక్కొక్కటి 5 తో బాస్కెట్లు  బాదాం పలుకుల బాస్కెట్, etc .  తమల పాకులు 100,  నల్లని పోక వాక్కలు 50, ఖర్జూరం పాకెట్, రూపాయి నాణెములు 21, టెంకాయలు 1, కూర్చ 1, పవిత్రలు 2, ఆగరబతి పాకెట్, కర్పూరం పాకెట్,  సెంట్ సీసా 1, కొబ్బరి చూర్ణము మరియు చక్కెర లేదా స్వీట్ బాక్స్ కిలో, లగ్న పత్రికలు, 2, అబ్బాయి తల్లి దండ్రులకు అబ్బాయికి బట్టలు, ఆభరణాలు వగైరా.  పురోహిత్ దక్షిణ  ఈ విధంగా పెండ్లి పిల్ల వాళ్ళు , మరియు పెండ్లి పిల్లవాడు వాళ్ళు కూడా తేవాలి. ఇరువురు ఒకరికి ఒకరు ఇచ్చుకోవాలి. 

యమ తర్పణం విధి విధానం

27-10-2019 ఆదివారం నాడు ఉదయం పూట యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షిణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు భుజించడం, సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. నరకలోకవాసులకు పుణ్యలోకప్రాప్తి కలిగించే ఉత్సవమని, అందుకు ఉద్దేశితమైన కార్యకలాప దినమని, తమకు నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశియని ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి. ‘చతుర్దశ్యాంతయే దీపాన్నరకాయ దదంతిచ, తేషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:’ చతుర్దశినాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృ దేవతలు నరకం నుండి స్వర్గం వెళతారని శాస్త్ర వచనం.

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-