పెరియాల్వార్లు రచించిన పల్లాన్డులో భగవంతుని పాదాల స్పర్శవలన సకల పాపాలు తొలగిపోతాయి.అతడు భగవంతుని పాదాలను ఒక పద్మ కమలము లాగ పోల్చి మనలను తరింప చేసిన వాడు. ఆ పాదాలు రామావతారములో అనేక మైళ్ళు నడచినకూడా అరిగిపోని కాళ్ళు మరియు చాల భలము గలవి. అలాగే భగవంతుని చేతులు కూడా చాల భలము గలవి. అయితే భగవంతుని చేతులు కాకుండా కాళ్ళ ప్రాముఖ్యత ఏమిటి అని అంటే భక్తులు భగవంతుని చేతుల కంటే పాదాలు పట్టుకోవదములోనే ఎంతో ఆనందము అనుభవిస్తూ పరవశించిపోతున్నాడు. సీతమ్మవారు రాముని కాళ్ళు పట్టుకొంటే నిన్ను నీ పాపాలను వోదిలిపెదతాడు అని చెప్పదములోనే భగవంతుని పాదాల మహిమ తెలుస్తున్నది కదా. మనమందరమూ కూడా భగవంతుని దాసులము కాబట్టి భగవంతుని పాదాల దగ్గిరనే మన నివాసము. ఎలాగయితే మనము అందరిచేత చేతులు కలుపుతూ మర్యాదగా పలకరించినట్టుగా భగవంతుని చేతులు అందరిలాగా పట్టుకోలేముకద. కాబట్టి ప్రతి భక్తుని ముఖ్య విధి భగవంతుని చరనములు పట్టుకొని మొక్కడమే. తల్లి తన పిల్లలను ఎతుకొని ముద్దు పెట్టినట్టుగానే ఆ భగవంతుడు కూడా భక్తుల భాదలు తీర్చాలనే తపనో ఉంటాడట.భక్తుడు కూడా భగవంతుని చరణములు పట్టుకొని విడవకుండా ఉండాలని మన శ్రీ వైష్ణవ ఆళ్వారుల ఆశీర్వచనములు మనకు ఉండాలని ప్రార్థన
హ్మణ-హిందూ సాంప్రదాయ వివాహ వేడుక " వివాహం" ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని , ధర్మ బద్ధం చేయడానికి పెద్దలు , ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ధర్మం ప్రాతిపదికగా , అర్థం-కామం సాధించడానికి భారతీయ హిందూ సాంప్రదాయ మూల సూత్రంగా రూపొందించిన విధానం "వివాహం". వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణ మార్గం సుగమం చేయబడింది. ఈ ప్రక్రియ భవిష్యత్ జీవిత ప్రణాళికకు మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇక ఆ ప్రణాళికే అతి పవిత్రమై , సమాజానికి మేలు చేసే దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంటుంది. వివాహానికి మరో పేరు "పరిణయం". దీనిని అసలు "పరిణయనం" - "పరి-నయనం" అనికూడా అంటారు. వధూవరులిద్దరు ఒకరి దృష్టిలో మరొకరు పడి , భవిష్యత్ దంపతులుగా , కష్ట-సుఖాలను సమంగా పంచుకుంటూ , జీవితాంతం కలిసి-మెలిసి వుందామని-వుంటామని కంటి సైగల ద్వారా తెలియపర్చుకోవడమే పరిణయం. " పెళ్ళి చూపుల" సాంప్రదాయం పెళ్ళి చూపులతో వివాహ ప్రక్రియ మొదలవడానికి పూర్వ రంగంలో , ఇరు పక్షాలకు చెందిన-ఇరువురికీ కావాల్సిన ...
Comments
Post a Comment